ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిలు ఫోన్‌ను వాడటంపై నిషేధం.. ఎన్నెన్నో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానం..!

ABN, First Publish Date - 2023-02-21T12:46:29+05:30

మహిళా లోకం కోపానికి కారణమవుతున్న ఈ అంశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటి కాలంలో మొబైల్ చిన్న పిల్లల చేతుల్లో కూడా ఉంటోంది. అయితే అమ్మాయిలు మొబైల్ వాడటం వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. అందుకే అమ్మాయిలు మొబైల్ వాడటం పై నిషేధం విధిస్తున్నామని ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానించారు. మహిళా లోకం కోపానికి కారణమవుతున్న ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకుంటే...

గుజరాత్ లో ఠాకూర్ కమ్యూనిటీ ఒక సబ్ క్యాస్ట్ గా ఉంది. ఈ వర్గం వారి జీవితంలో మెరుగుదల కోసం అనేక విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా అమ్మాయిలు మొబైల్ వాడకూడదనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల అక్కడి అమ్మాయిలు చాలా కోపంగా ఉన్నారు. అమ్మాయిలు నేటి సమాజంలో లింగ అసమానతలను తొలగించుకుంటూ ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. అలాంటిది ఠాకూర్ కమ్యూనిటీ ఇలాంటి ఉత్తర్వులు జారిచేయడంతో మహిళలు మండిపడుతున్నారు.

అక్కడి ఠాకూర్ కమ్యూనిటీ మాత్రం అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడటం వల్ల అబ్బాయిలతో పరిచయాలు పెరగడం, కులాంతర వివాహాలు చేసుకోవడం, ప్రేమ సంబంధాలు ఏర్పడటం మొదలైనవి జరుగుతున్నాయని, ముఖ్యంగా మైనర్ బాలికలు వీటికి బలి అయిపోతున్నారని చెప్పారు. వీటిని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Read also: Viral Video: క్లాస్‌రూమ్‌లో టేబుల్ కిందకు వంగి మరీ ప్రేయసితో ఓ విద్యార్థి ఫోన్‌కాల్.. సైలెంట్‌గా వెళ్లి పక్కనే కూర్చున్న టీచర్.. చివరకు..


కేవలం అమ్మాయిల విషయంలోనే కాకుండా ఇతర విషయాలలో కూడా వీరు కొన్ని నిర్ణయాలు చెప్పారు. ఎక్కడైనా పెళ్లి లేదా నిశ్చితార్థం జరిగితే దానికి కేవలం 11 మంది మాత్రమే హాజరు కావాలని నిర్ణయించారు. దీని వల్ల కుటుంబాలకు పెళ్లి ఖర్చు తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పెళ్లిళ్లలో డీజే సౌండ్ సిస్టం పెట్టకూడదని నిబంధనలు పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా తమ కమ్యూనిటీ వారు ఏ గ్రామంలో అయినా ఎక్కువ ఉండి, వారిలో పెళ్లి కావాల్సిన యువత ఉంటే వారికి సామూహిక వివాహాలు జరిపించాలన్నారు. పెళ్లి అయినం తరువాత ఎవరైనా విడిపోవాలని చూస్తే ఆ కుటుంబానికి జరిమానా విధిస్తామని చెప్పారు. వీటి ద్వారా వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, ఆడపిల్లలు చదువు కోసం నగరాలకు వెళ్లాల్సి వస్తే వారి ప్రయాణ సౌకర్యం కోసం ఉపయోగిస్తామని అన్నారు.

వీరు తీసుకున్న నిర్ణయాలు కాస్త కఠినంగానే ఉన్నా అవి సమాజ హితమైనవేనని కొందరు అంటున్నారు. కానీ అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడరాదనే నిర్ణయం మాత్రం మహిళల ఆగ్రహానికి గురవుతోంది.

Updated Date - 2023-02-21T12:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising