-
-
Home » Telangana » Karimnagar » Development with the coordination of public representatives and authorities-NGTS-Telangana
-
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-05-06T06:10:42+05:30 IST
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.
- జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి
కోనరావుపేట, మే 5: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో ప్రజలందరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు పలు సమస్యలపై సభ దృష్టికి తీసుకురాగా స్పందించిన జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే రమేష్బాబు సహకారంతో ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు. సమావేశంలో తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో రామకృష్ణ, ఫ్యాక్స్ చైర్మన్లు రామ్మోహన్రావు, బండ నర్సయ్య, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ మంతెన సంతోష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.