జనసైనికుల మానవత్వం

ABN , First Publish Date - 2022-05-09T06:46:46+05:30 IST

మాతృ దినోత్సవం రోజున జనసేన పార్టీ కార్యకర్తలు మానవత్వం చాటారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నిరోజులుగా మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన చిన్నారి దారెల్లి మెరీనా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది.

జనసైనికుల మానవత్వం
ఆర్థికసాయం చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు

అనంతగిరి, మే 8:  మాతృ దినోత్సవం రోజున జనసేన పార్టీ  కార్యకర్తలు  మానవత్వం చాటారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నిరోజులుగా మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన చిన్నారి దారెల్లి మెరీనా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. చిన్నారి తల్లిదండ్రులు దారెల్లి అశోక్‌, నయోమి రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారికి వైద్యం చేయించడం ఆ దంపతులకు ఆర్థికంగా మారింది. దీంతో ఆ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చి వైద్య ఖర్చుల  నిమిత్తం రూ.5 వేల ఆర్థికసాయం అందించారు.  చిన్నారి వైద్యానికి రూ.4లక్షలు అవసరమని, దాతల సాయంతో పాపను కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో జనసేన ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి టి.నవీన్‌, వై.గోపి, ఎం.మహేష్‌, కిశోర్‌, అనిల్‌, రాజు, గోపి, సందీప్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 



Read more