ఘనంగా వాసవీ మాత జయంతి

ABN , First Publish Date - 2022-05-12T06:00:43+05:30 IST

పెనుగొండలోని వాసవి శాంతి థామ్‌లో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాసవీ మాత జయంతి
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

పెనుగొండ, మే 11: పెనుగొండలోని వాసవి శాంతి థామ్‌లో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణాంద పురి  స్వామిజీ ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ట్రస్టు కార్యనిర్వహక సభ్యు లు నందకుమార్‌ బెంగుళూరు వారిచే డ్రైప్రూట్స్‌, ఆవు పాలు, పెరుగు, కర్ణాటక రాష్ట్రం బళ్లారి భక్త బృందం వారిచే నూట ఎనిమిది  కేజీల తేనె, 108 కేజీల బెల్లం, నూట ఎనిమిది కేజీల ఆవు నెయ్యి, 108 కొబ్బరి బొండాలు, 108 లీటర్ల ఆవుపాలు, 108 లీటర్లు ఆవు పెరుగు ద్రవ్యములచే వాసవి మాతకు విశేష అభిషేకం నిర్వహించారు. స్థానిక వాసవి గీతా మహిళా సమాజం 108 మంది మహిళలుచే 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఆర్‌టీఐ చైర్మన్‌ రేపాల శ్రీనివాస్‌ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఎన్‌ గోవిందరాజులు, సాయి వెంకట రాజు, బొండాడ రాంపండు, కోట్ల వెం కటేశ్వరరావు, కోట్ల సూర్యారావు, కోట్ల కృష్ణారావు, నారికడమిల్లి రామానంద రావు, నారికడమిల్లి సుబ్రహ్మణ్యం, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. 



Read more