దొంగల ముఠా సభ్యులు ఆరుగురు అరెస్ట్
ABN, First Publish Date - 2020-09-25T00:06:58+05:30
దొంగల ముఠా సభ్యులు ఆరుగురు అరెస్ట్
విశాఖ: నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠా సభ్యులు ఆరుగురిని అరెస్ట్ చెసినట్లు డీసీపీ క్రైమ్ సురేష్బాబు తెలిపారు. ఒంటరిగా వెళ్తున్న వాళ్లను బెదిరించి దోపిడీలకు పాల్పడే మైచర్ల గణేష్, నాగమల్లి, ఎల్లాజీ, తాళ్లూరి కుమార్తో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-09-25T00:06:58+05:30 IST