ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ABN, First Publish Date - 2020-07-28T08:56:15+05:30

ఈఎస్ఐ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఈఎస్ఐ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషనపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ ముందు జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎ్‌సఐ మాజీ డైరెక్టర్‌ సీకే రమేశ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. 

Updated Date - 2020-07-28T08:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising