నాపై అక్రమంగా కేసు.. హైకోర్టుకు అయ్యన్న
ABN, First Publish Date - 2020-06-19T09:41:06+05:30
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల ..
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నానన్న కక్షతో తనపై అక్రమంగా కేసు బనాయించారని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.
Updated Date - 2020-06-19T09:41:06+05:30 IST