భార్యతో వీడియోకాల్లో మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-11T08:02:07+05:30
భార్యతో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఓ బ్యాంకు ఉద్యోగి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమల, డిసెంబరు 10: భార్యతో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఓ బ్యాంకు ఉద్యోగి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాగ్హాట్ జిల్లా తెలిసిల్లాబర్రాకు చెందిన పంకజ్ బీసీన్(32) చిత్తూరు జిల్లా సోమల కార్పొరేషన్ బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరు నెలలక్రితం మధ్యప్రదేశ్కు చెందిన కిరణ్కుమారితో వివాహం జరిగింది. ఆమె అక్కడే ప్రభుత్వ వైద్యశాలలో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేస్తోంది. బుధవారం రాత్రి భార్యకు వీడియోకాల్ చేసి మాట్లాడిన పంకజ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. ఆమె వెంటనే విషయాన్ని సోమలలోని పంకజ్ సహచర ఉద్యోగులకు ఫోన్ ద్వారా తెలిపింది. వారు అక్కడికి చేరుకునేటప్పటికే పంకజ్ ఫ్యాన్కు ఉరేసుకోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే పంకజ్ మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు.
Updated Date - 2020-12-11T08:02:07+05:30 IST