సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
ABN, First Publish Date - 2020-10-27T22:57:22+05:30
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగన్ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ కేసులో డిశ్చార్జ్
హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగన్ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగాయి. ఇదిలా ఉంటే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఓటుకు నోటు కేసు విచారణ...
ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా పిటిషన్లపై బుధవారం వాదనలు కొనసాగనున్నాయి. మద్యం సిండికేట్ కేసులో సాక్షుల విచారణ ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
Updated Date - 2020-10-27T22:57:22+05:30 IST