ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
ABN, First Publish Date - 2020-07-21T01:26:47+05:30
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలం పట్రపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. ఈత సరదాతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పట్రపల్లి తాండాకు చెందిన శ్రీనివాసులునాయక్ కుమారుడు రాకేష్ నాయక్ (12), అదే గ్రామానికి చెందిన శ్రీ రాములు నాయక్ కుమారుడు లక్ష్మీతేజు నాయక్ (8) ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-07-21T01:26:47+05:30 IST