ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ

ABN, First Publish Date - 2020-12-11T06:48:56+05:30

తిరుమల వరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.

మాడవీధుల్లో ఊరేగుతున్న వరాహస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల వరాహస్వామి ఆలయంలో గురువారం ఉదయం 9నుంచి 10.30 గంటల మధ్య మకరలగ్నంలో బాలాలయ సంప్రోక్షణ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, వరాహస్వామి ఉత్సవమూర్తుల ను సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, ప్రధాన కుంభారాధన, అర్చన నిర్వహించారు. అనంతరం వరాహస్వామి ప్రధాన హోమగుండమైన సభ్యహోమ గుండంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలోని వరాహ స్వామికి ప్రాణప్రతిష్ట నిర్వహించారు.టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.సంప్రోక్షణ సందర్భంగా రాత్రి 8గంటలకు వరాహస్వామిని మాడవీధుల్లో ఊరేగించారు.

ఐదునెలల పాటు వరాహస్వామి దర్శనం రద్దు

 వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుపూత పూయబడిన రాగిరేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తికావడానికి దాదాపు 5 నెలలు సమయం పడుతుందన్నారు. అప్పటివరకు భక్తులకు వరాహస్వామి మూలమూర్తి దర్శనం ఉండదన్నారు. 

Updated Date - 2020-12-11T06:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising