స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి
ABN, First Publish Date - 2020-11-06T09:32:12+05:30
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై పునరాలోచన చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, సీపీఐ రాష్ట్ర
సీఎంకు అనగాని, సీపీఐ లేఖలు
అమరావతి, నవంబరు5(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై పునరాలోచన చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారిరువురూ విడివిడిగా సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున పాఠశాలలు నడిపి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు.
Updated Date - 2020-11-06T09:32:12+05:30 IST