పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మ్యాపింగ్: డీజీపీ
ABN, First Publish Date - 2020-05-11T10:47:10+05:30
విశాఖ తరహా ప్రమాదాలు పరిశ్రమల్లో సంభవించకుండా పరిశ్రమల్లో మ్యాపింగ్ చేపడుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల
శ్రీకాకుళం, మే 10(ఆంధ్రజ్యోతి): విశాఖ తరహా ప్రమాదాలు పరిశ్రమల్లో సంభవించకుండా పరిశ్రమల్లో మ్యాపింగ్ చేపడుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల సమీక్ష అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు సంతృప్తికరంగా కరోనా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘55 ఏళ్లు పైబడిన పోలీసు సిబ్బందికి క్షేత్రస్థాయి విధులను అప్పగించకుండా, కార్యాలయాలకే పరిమితం చేశాం. విధుల్లో మరణించిన పోలీసు ఉద్యోగులకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాం. రూ.3కోట్లతో పోలీసులకు మాస్కు లు, శానిటైజర్లు, విటమిన్ ట్యాబెట్లను అందజేస్తున్నా’మని డీజీపీ తెలిపారు.
Updated Date - 2020-05-11T10:47:10+05:30 IST