వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్
ABN, First Publish Date - 2020-06-25T22:40:55+05:30
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వర ప్రసాద్ గురువారం నామినేషన్ వేశారు.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వర ప్రసాద్ గురువారం నామినేషన్ వేశారు. వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకరరావు, శ్రీదేవి, కృష్ణమూర్తి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో డొక్కా టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-06-25T22:40:55+05:30 IST