ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివాలయంలో శిలువ బొమ్మలు

ABN, First Publish Date - 2020-07-14T11:26:33+05:30

సిరిపురం శివాలయంలోకి ఆదివారం రాత్రి దుండగులు చొరబడి పలుచోట్ల శిలువ బొమ్మలు, క్రీస్తు రక్ష అంటూ రాసి కలకలం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, జూలై 13: సిరిపురం శివాలయంలోకి ఆదివారం రాత్రి దుండగులు చొరబడి పలుచోట్ల శిలువ బొమ్మలు, క్రీస్తు రక్ష అంటూ రాసి కలకలం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ అర్చకుడు చాగంటిపాటి అబ్బు ఆలయ గోడలపై ఉన్న వాటిని చూసి గ్రామపెద్దలకు చెప్పి, అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా హిందూ మనోభావాలను కించపరిచేలా శివుడి బొమ్మలపై శిలువబొమ్మలు వేయడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మండలాధ్యక్షుడు రెడ్డి రమణేశ్వర్‌, పుట్టా వీరప్రసాద్‌గాంధీ, హిందూ చైతన్య సదస్సుల ప్రతినిధి పడాల రఘు, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ కార్యదర్శి డి.సాంబశివరావు ఆలయానికి విచ్చేసి శిలువబొమ్మలను పరిశీలించారు. బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని కరప పోలీసులు, దేవదాయ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అర్చకులు, గ్రామస్థులు ఆలయాన్ని సంప్రోక్షణచేసి పూజలను ప్రారంభించారు. 


Updated Date - 2020-07-14T11:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising