అనుమతులు ఎలా ఇచ్చారు
ABN, First Publish Date - 2020-05-09T07:59:23+05:30
విశాఖలో భీభత్సం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కొన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి, మే 8: విశాఖలో భీభత్సం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కొన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అనపర్తిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి ముందుగా కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఎందుకు నిర్వహించారని, కంపెనీ ప్రతినిధులపై బెయిల్బుల్ కేసులు నమోదు కావడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి కంపెనీ ఎంత ప్రమాదమో మరోసారి తేటతెల్లమైందని రంగంపేట మండలం దొంతమూరులో బిర్లా సంస్థ నిర్మించే పరిశ్రమ కూడా ఇటువంటి కోవలోకే వస్తుందని ఇప్పటికైనా ఇటు వంటి సంస్థలు జనావాసాల మధ్య నిర్మించకుండా చర్యలు చేపట్టాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2020-05-09T07:59:23+05:30 IST