ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టినరోజు నాడే కొల్లు రవీంద్ర నిరశన

ABN, First Publish Date - 2020-06-21T09:55:38+05:30

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్‌ 3 ఇళ్లు పేదలకు కేటాయించాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన పుట్టిన రోజు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీ ప్లస్‌ 3 ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌


మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 20: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్‌ 3 ఇళ్లు పేదలకు కేటాయించాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన పుట్టిన రోజు నాడే మచిలీపట్నంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల వెయ్యి జీ ప్లస్‌ 3 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 3 లక్షల 9 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు.


కృష్ణాజిల్లాకు 96వేల ఇళ్లు మంజూరు కాగా 31 వేలు పూర్తయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 4130 ఇళ్లు పూర్తయ్యాయని, లాటరీ వేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ వీరెవరికీ జీ ప్లస్‌ 3 ఇళ్లను స్వాధీనం చేయలేదన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిని కేటాయించడానికి వచ్చిన సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-21T09:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising