ఏపీపీఎస్సీ నోటిపికేషన్లు విడుదలచేయాలి: కేఎస్
ABN, First Publish Date - 2020-06-25T09:53:31+05:30
ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం ఇయర్ విధానం అమలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేఏస్ లక్ష్మణరావు, నిరుద్యోగ
గుంటూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం ఇయర్ విధానం అమలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేఏస్ లక్ష్మణరావు, నిరుద్యోగ ఐక్యవేదిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో లక్షలాదిగా ఉన్న ఖాళీపోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఒకే పరీక్షా విధానాన్ని అమలుచేయాలన్నారు.
ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి 46ఏళ్లకు పెంచాలని కోరారు. గత నవంబర్లో నిర్వహించిన ఏపీపీఎస్సీ సమీక్షసమావేశం తుది నివేదికను బహిర్గతం చేయాలని.. అనువాదదోషాలు లేకుండా ప్రతి అభ్యర్థికి సమన్యాయం జరిగే విధంగా ప్రశ్నపత్రం రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ ఐక్యవేదిక కో కన్వీనర్ బి. అరుణ్కుమార్, సభ్యులు జి.శ్రీనివాసరెడ్డి, కె.వంశీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-25T09:53:31+05:30 IST