ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ళ స్థలాల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-27T05:24:28+05:30

దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లో 30.75 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతున్నదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇళ్ళ స్ధలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి 

నరసరావుపేట, డిసెంబరు 26 : దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లో 30.75 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతున్నదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. నరసరావుపేట పట్టణ లబ్ధిదారుల కోసం ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. ఇళ్ళ స్థలాల పంపిణీతో 17వేల కొత్త టౌన్‌ షిప్‌లు ఏర్పాటు అవుతున్నాయని ఉమ్మారెడ్డి తెలిపారు.  రూ.20 వేల కోట్లు స్థలాలకు ఖర్చు అవుతున్నదన్నారు. వీటిలో ఇళ్ళ నిర్మాణానికి అంచనా వేస్తే రూ.51 వేల కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారన్నారు. ఉప్పలపాడు వద్ద 6,400 మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జనవరి 3న జరుగుతుందని డాక్టర్‌ గోపిరెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, తహసీల్దార్‌ రమణనాయక్‌, ఎంఈ కె.రామ్మోహనరావు, ఎంపీడీవో బూచిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising