ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో.. ఆ నలుగురూ రాకపోయే..!

ABN, First Publish Date - 2020-04-24T14:10:02+05:30

కరోనా భయంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా బంధువులు భయపడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమృకోట (రెంటచింతల): కరోనా భయంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా బంధువులు భయపడిన సంఘటన తుమృకోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. తుమృకోటకు చెందిన ఓ మహిళ నుంచి ఇటీవల కరోనా శాంపిల్స్‌ సేకరించారు. ఆమె మంగళవారం మృతిచెందింది. దీంతో బుధవారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఆ నలుగురు వ్యక్తులు రావడానికి భయపడ్డారు. ఓ దశలో ఒక దుప్పట్లో మూటకట్టి వెదురుబొంగుకు తగిలించి ఇద్దరు మోసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.


ఈ సమాచారం పోలీసులకు తెలియటంతో వారు స్థానికులకు నచ్చచెప్పారు. ఆమెకు నెగిటివ్‌ రిపోర్డు వచ్చిందని, భయపడాల్సిన పనిలేదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు గ్రామస్థులకు తెలియజెప్పటంతో చివరకు మృతదేహాన్ని బంధువులు నులకమంచంపై ఉంచి అంత్యక్రియలు బుధవారం రాత్రికి ముగించారు.

Updated Date - 2020-04-24T14:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising