టీచర్ల బదిలీల్లో అన్యాయం జరగదు: మంత్రి సురేష్
ABN, First Publish Date - 2020-12-12T00:27:26+05:30
టీచర్ల బదిలీల్లో ఎలాంటి అన్యాయం జరగదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు
అమరావతి: టీచర్ల బదిలీల్లో ఎలాంటి అన్యాయం జరగదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల చేస్తున్న ఆందోళనలపై సురేష్ స్పందించారు. లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. హెడ్ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ ఉంటుందని చెప్పారు. 2 ఏళ్లు పూర్తైనవారికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరింత పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. హెచ్ఆర్ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించినట్లు వెల్లడించారు. 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు. బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరన్నారు. డిసెంబర్ 16 నుంచి 6 రోజులు లిస్ట్ డిస్ప్లే చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
Updated Date - 2020-12-12T00:27:26+05:30 IST