పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
ABN, First Publish Date - 2020-04-24T11:46:43+05:30
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
రాజమహేంద్రవరం: పాలిటెక్నిక్ ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ -2020 పరీక్షలు దరఖాస్తులకు గడువును మే 15వ తేదీ వరకు పొడిగించినట్టు రాజమహేంద్రవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి హల్టికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్కార్డు నెంబరు, మొబైల్ నెంబరుతోపా టు రూ.400 రుసుముతో ఆన్లైన్లో పాలిసెట్ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Updated Date - 2020-04-24T11:46:43+05:30 IST