జేఈఈ మెయిన్స్లో మెరిసిన కడప విద్యార్థి
ABN, First Publish Date - 2020-09-13T08:20:36+05:30
జేఈఈ మెయిన్స్లో మెరిసిన కడప విద్యార్థి
కడప(కల్చరల్), సెప్టెంబర్ 12: నగరానికి చెందిన శశాంక్ అనిరుధ్రెడ్డి ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా స్థా యిలో 7వ ర్యాంక్ను సాధించి కడప సత్తా చాటాడు. నగరానికి చెంది న డాక్టర్ నిషిత, ఆర్ధ్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖరరెడ్డిల తనయుడైన శ శాంక్ మారుతీనగర్లోని సంకల్ప్ ఐఐటీ ఫౌండేషన్లో శిక్షణ తీసుకొని హైదారాబాదులోని శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ చదివాడు. ఫిజిక్స్లో మంచి మార్కులు సాధించి ఆల్ ఇండియాలో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తమ విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్లో సీటు సంపాదించడం పట్ల సంస్థ డైరెక్టర్లు రేణుకాదేవి, వంశీకృష్ణలు అభినందించారు.
Updated Date - 2020-09-13T08:20:36+05:30 IST