‘ఇస్రో)లో కరోనా కలకలం...
ABN, First Publish Date - 2020-05-18T18:32:35+05:30
కోయంబేడు కరోనా లింక్లు కలవరం సృష్టిస్తున్నాయి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రమంగా కరోన కేసులు కోయంబేడు లింక్ల కారణంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)’ లో కూడా కరోనా కలకలం రేగింది. సూళ్లూరుపేటలో కోయంబేడు లింక్ లు ఎక్కువగా ఉంటున్నాయి.
నెల్లూరు : కోయంబేడు కరోనా లింక్లు కలవరం సృష్టిస్తున్నాయి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రమంగా కరోన కేసులు కోయంబేడు లింక్ల కారణంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)’ లో కూడా కరోనా కలకలం రేగింది. సూళ్లూరుపేటలో కోయంబేడు లింక్ లు ఎక్కువగా ఉంటున్నాయి.
తమిళనాడుకు చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 కి చేరుకుంది. ఇప్పుడు ఈ సెగ ఇస్రోను కూడా తాకింది. కోవిడ్ కేసులు మటుమాయమయ్యేవరకు తాము జనరల్ డ్యూటీలు చేయలేమని షార్ ఉద్యోగులు అధికారులకు ఖరాఖండిగా చెబుతుండడం గమనార్హం.
కొందరు ఉద్యోగులైతే... ఇదే క్రమంలో సంస్థ రెండవ గేటు వద్ద ధర్నా కు దిగారు కూడా. ఈ క్రమంలో... ఉన్నతాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో... ఉద్యోగుల డిమాండ్ను ఆమోదించినట్లు సమాచారం.
Updated Date - 2020-05-18T18:32:35+05:30 IST