ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-13T09:10:45+05:30

మండల పరిధిలోని గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన ఉమ్మడి దస్తగిరి రెడ్డి (48) అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల నుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవుకు, సెప్టెంబరు 12: మండల పరిధిలోని గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన ఉమ్మడి దస్తగిరి రెడ్డి (48) అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల నుంచి వరుసగా పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు రూ.15 లక్షల వరకూ అయ్యాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక శనివారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


కుటుంబీకులు చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు దస్తగిరి రెడ్డికి భార్య అన్నపూర్ణ, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-13T09:10:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising