ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైకును ఢీకొన్న ఎక్స్‌కవేటర్‌

ABN, First Publish Date - 2020-11-06T05:41:54+05:30

మండలంలోని హరినగరం, నరసాపురం గ్రామాల మధ్య ఊటికుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముకుందాపురం గ్రామానికి చెందిన దవనం ఓబులేసు (32) అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతి చెందిన దవనం ఓబులేసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

రుద్రవరం, నవంబరు 5: మండలంలోని హరినగరం, నరసాపురం గ్రామాల మధ్య ఊటికుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముకుందాపురం గ్రామానికి చెందిన దవనం ఓబులేసు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. ముకుందాపురం గ్రామం నుంచి భార్య ఆదిలక్ష్మి, సడగుడు ఓబులేసుతో కలిసి బైకుపై ఆళ్లగడ్డ ఆసుపత్రికి వెళ్తుండగా ఎక్స్‌కవేటర్‌ మోటార్‌సైకిల్‌ను దాటే క్రమంలో ఢీకొట్టింది. దవనం ఓబులేసు అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఆదిలక్ష్మి, మహానంది మండలం తమడపల్లె గ్రామానికి ఓబులేసు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ ఆలమూరు గ్రామానికి చెందినదిగా గుర్తించామని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌ దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దవనం ఓబులేసుకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న భార్య ఆదిలక్ష్మిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-06T05:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising