ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే నీట్‌

ABN, First Publish Date - 2020-09-13T07:30:13+05:30

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహణ కోసం నేషనల్‌ టెస్టింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హాజరుకానున్న 15.97 లక్షల మంది విద్యార్థులు
  • దేశవ్యాప్తంగా 3,843 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే  జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహణ కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లను చేసింది. ఒక్కో గదిలో కేవలం 12 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్‌ రాసే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా) ఓ గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలను హాల్‌ టికెట్‌లో వివరించారు. అలాగే తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా ఉంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎంట్రెన్స్‌లోనే జ్వరం ఉందో లేదో పరిశీలించి లోపలికి పంపిస్తారు. అభ్యర్థుల వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్క్‌, గ్లౌజులు, శానిటైజర్‌, ట్రాన్స్‌పరెంట్‌ నీళ్లబాటిళ్లను అనుమతిస్తారు.


ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. ముందుగా 2,546 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వీటి సంఖ్యను 3,843కి పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో 61,890 మంది పరీక్ష రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, తెలంగాణలో 55,800 మంది అభ్యర్థులకు 112 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్‌ పరీక్షకు భయపడి తమిళనాడులోని మధురైలో ఓ విద్యార్థిని శనివారం ఆహ్మత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులకు నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2020-09-13T07:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising