ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-12-27T02:04:21+05:30

అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు

మాట్లాడుతున్న సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

కావలిటౌన్‌ డిసెంబరు26: అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం స్ధానిక సీపీఎం  కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులు తమ హక్కుల కోసం,  నల్ల చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో నెల నుంచి ఉద్యమం చేస్తుంటే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.  రైతు ఉద్యమానికి మద్దతు పలికి సహకరిస్తే విదేఽశాలనుంచి నిధులు వస్తున్నాయని, విద్రోహ శక్తుల చేతుల్లో ఉద్యమం పోయిందని ప్రధాని ఆరోపించడం దేశరైతులను కించపరిచినట్లేనన్నారు. మోదీ, అమిత్‌షాలు ఇద్దరే దేశ భక్తులుగా మిగిలిన ప్రజలంతా దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో అధికారంలో వచ్చేందుకే కార్పొరేట్‌ కంపెనీల చేతిలో రైతాంగాన్ని, అన్ని వ్యవస్ధలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.  సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తాళ్లూరు మాల్యాద్రి, పట్టణ కమిటీ కార్యదర్శి పెంచులయ్య, సీఐటీయు జిల్లా నాయకులు వీ మల్లికార్జునరావు, సబ్బురాయశర్మ, తదితరులు పాల్గొన్నారు.


-----------


Updated Date - 2020-12-27T02:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising