చెరువు కాదు.. రామతీర్థం హైస్కూల్ అవరణం
ABN, First Publish Date - 2020-12-12T04:55:32+05:30
మండల పరిధిలోని రామతీర్థంలో జడ్పీ ఉన్నత పాఠశాల చెరువును తలపిస్తోంది. ఇటీవల ‘నివర్’ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే.
పట్టించుకోని అధికారులు
విడవలూరు, డిసెంబరు 11: మండల పరిధిలోని రామతీర్థంలో జడ్పీ ఉన్నత పాఠశాల చెరువును తలపిస్తోంది. ఇటీవల ‘నివర్’ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే. ఆ వర్షానికి హైస్కూల్ నీటితో మునిగిపోయింది. ఈ క్రమంలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో వర్షం నిలిచిపోయినా నీరు మాత్రం అలాగే ఉండి, దుర్గంధం వెదజల్లుతోంది. సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవటంతో పాఠశాల విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిలోనే నడుచుకుంటూ ప్రతిరోజు విద్యార్థులు పాఠశాల గదులకు వెళుతున్నారు. ఒక్కో సమయంలో నీటిలో జారి దుస్తులు, పుస్తకాలు తడిసిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2020-12-12T04:55:32+05:30 IST