రెడ్జోన్లలో రేషన్ పకడ్బందీగా పంచుతాం
ABN, First Publish Date - 2020-04-15T10:12:20+05:30
నాయుడుపేట పట్టణంలో రెడ్జోన్లుగా ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఇంటింటికీ పకడ్బందీగా
తహసీల్దారు శ్రీనివాసులు
నాయుడుపేట టౌన్, ఏప్రిల్ 14 : నాయుడుపేట పట్టణంలో రెడ్జోన్లుగా ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఇంటింటికీ పకడ్బందీగా రేషన్ సరుకులను చేర్చేలా చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు. తహసీల్దారు కార్యాలయంలో రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు కావాల్సిన గోనుసంచులను మంగళవారం రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ మిగతా ప్రాంతాల్లో రేషన్దుకాణాల పరిధిలో మూడు 3 కౌంటర్లుగా ఏర్పాటు చేసి భౌతిక దూరాన్ని పాటించి రద్దీలేకుండా రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-04-15T10:12:20+05:30 IST