ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
ABN, First Publish Date - 2020-09-05T12:25:59+05:30
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 1277 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 1277 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,295లకు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 368 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 313 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 89 మంది డిశ్చార్జ్ అయ్యారు. 104 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్లలో ప్రస్తుతం 12,651 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Updated Date - 2020-09-05T12:25:59+05:30 IST