జిల్లా వినియోగదారుల సంఘ కమిటీ ఎన్నిక
ABN, First Publish Date - 2020-03-02T11:02:15+05:30
జిల్లా వినియోగదారుల సంఘ ఎన్నికలు స్థానిక ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షుడిగా వి.రవికుమార్
కంభం, మార్చి 1 : జిల్లా వినియోగదారుల సంఘ ఎన్నికలు స్థానిక ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షుడిగా వి.రవికుమార్ (ఒంగోలు), ప్రధాన కార్యదర్శిగా వై.సురేష్బాబు (ఒంగోలు), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వి.వీరారెడ్డి (గిద్దలూరు), ట్రెజరర్గా ఎస్డీ జలీల్ (కంభం), ఉపాధ్యక్షుడిగా ఎన్.బసిరెడ్డి (తర్లుపాడు),టి.వెంకటేశ్వర్లు(టంగుటూరు), పీఆర్వోగా షేక్ నజీర్బాషా(కనిగిరి), కల్చరల్ సెక్రటరీగా వై.అంజిరెడ్డి(అర్ధవీడు), డివిజన్ సెక్రటరీలుగా సీహెచ్ ప్రసాద్ (కనిగిరి), బీవీఎస్వీ ప్రసాద్ (బేస్తవారపేట), ఇమ్మానియేలు (చీరాల) ఎన్నికైనట్టు తెలిపారు. కార్యక్రమంలో కంభం మండల అధ్యక్షుడు ఓసీహెచ్ నరసింహులు, ప్రధాన కార్యదర్శి జలీల్, నాగేంద్రుడు, సుబ్బారావు, రామాంజనేయులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-02T11:02:15+05:30 IST