ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న మిర్చి రైతులకు ఏలూరి చేయూత

ABN, First Publish Date - 2020-12-07T04:04:27+05:30

తుఫాన్‌కు దెబ్బతిన్న మిర్చి రైతులకు చేయూత అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నడుంబిగించారు. భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన వారికి బాసటగా నిలిచారు.

రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నర్సరీ యాజమాన్యాలతో మాట్లాడిన ఎమ్మెల్యే

తక్కువ ధరకు మొక్కలు అందేలా కృషి

నియోజకవర్గ పరిధిలో నారు అవసరమైతే 9866647618 ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే వినతి

పర్చూరు, డిసెంబరు 6 : తుఫాన్‌కు దెబ్బతిన్న మిర్చి రైతులకు చేయూత అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నడుంబిగించారు. భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన వారికి బాసటగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన నారా లోకే్‌షకు ఎమ్మెల్యే ఏలూరి రైతుల పరిస్థితిని వివరించారు. మళ్లీ పంటలు వేసుకొనేందుకు సిద్ధమైన రైతులకు మిర్చి నారు ధర దిమ్మతిరిగేలా ఉంది. కొన్ని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.3 నుంచి రూ.6వరకు పలుకుతోందన్న విషయాన్ని రైతులు ఏలూరి దృష్టికి తీసుకుపోయారు. వారి ఆవేదనకు స్పందించిన ఏలూరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిర్చి నర్సరీల యాజమాన్యాలతో మాట్లాడి 25 లక్షల మొక్కలను ముందస్తుగా బుక్‌ చేసి తక్కువ ధరకు అందేలా చేశారు. వీటిలో ప్రధానంగా తేజ రకం, సెగ్మెంట్‌ 341 తోపాటు నెంబర్‌ 5కూడా రైతులకు అందుబాటులో లభించనుంది. ఒక్కో మొక్క రూ.1.20 పైసలకే అందనుంది. అలాగే మొక్కలను నేరుగా రైతు నివాసానికే చేర్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతుకు కావలసిన మొక్కలు, గ్రామాల పేరు వివరాలను 9866647618 రైతు విభాగం నెంబర్‌లో సంప్రదించాలని ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-12-07T04:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising