‘సర్వే బృందాలను పెంచాం’
ABN, First Publish Date - 2020-05-10T08:42:59+05:30
కంటైన్మెంట్ జోన్ పరిధిలోని పీఎన్ కాలనీలోని పది లైన్లు, గుజరాతీపేట, సీపాన్నా యుడుపే ట, చౌదరి సత్యనారాయణ కాలనీలో సర్వే చేసేందుకు సర్వే ..
గుజరాతీపేట: కంటైన్మెంట్ జోన్ పరిధిలోని పీఎన్ కాలనీలోని పది లైన్లు, గుజరాతీపేట, సీపాన్నా యుడుపే ట, చౌదరి సత్యనారాయణ కాలనీలో సర్వే చేసేందుకు సర్వే బృందాలను పెంచినట్లు నగరపాలక హెల్త్ ఆఫీసర్ వెంకటరావు తెలిపారు. ఏడుగురు వైద్యులు, 12మంది ఏఎన్ఎంలు, 33 మంది వలంటీర్లు, ఆశ కార్యకర్తలతో ప్రజల ఆరోగ్యంపై సర్వే జరిపిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని సేకరించి వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-05-10T08:42:59+05:30 IST