ప్రజలే ఏమిటనేది నిర్ణయిస్తారు: స్పీకర్ తమ్మినేని
ABN, First Publish Date - 2020-10-13T19:44:34+05:30
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల సవాళ్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల సవాళ్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయం కన్పిస్తోందని అన్నారు. రాజధాని విశాఖలో కావాలని అధికార పార్టీ, వద్దని ప్రతిపక్షం.. ఎన్నికలకు వెళ్తే మంచిదేనని, ప్రజలే ఏమిటనేది నిర్ణయిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణపై ఏం జరుగుతుందో వేచి చూద్దామని తమ్మినేని సీతారాం అన్నారు.
Updated Date - 2020-10-13T19:44:34+05:30 IST