ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తూర్పు’న దౌర్జన్యాలు, బెదిరింపులు

ABN, First Publish Date - 2020-03-12T10:43:05+05:30

తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున శీరంరెడ్డి సీతాలక్ష్మి నామినేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున శీరంరెడ్డి సీతాలక్ష్మి నామినేషన్‌ వేయడానికి రాగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వెంట వచ్చిన నేతలను పోలీసుల ఎదుటే చితకబాదారు. ఆమె చేతిలో నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించిపారేశారు. పెదపూడి మండలం పెద్దాడ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి నామినేషన్‌ వేసేందుకు రాగా, వైసీపీ నేతలు అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో మరో వ్యక్తితో పత్రాలు లోపలకు పంపించారు. తొండంగి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నేమాల నూకరాజు నామినేషన్‌ పత్రాలను వైసీపీ నేతలు లాక్కొని చించేశారు. కరప మండలం నడకుదురు-1 జనసేన అభ్యర్థి భాస్కరరావును వైసీపీ నేతలు బెదిరించడంతో నామినేషన్‌ వేయకుండా వెనుదిరిగారు. 


Updated Date - 2020-03-12T10:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising