ఆగస్టు 2 నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు
ABN, First Publish Date - 2020-07-28T23:50:33+05:30
ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ప్రకటన
విజయవాడ : ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కాగా, పవిత్రోత్సవాల సందర్భంగా 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
Updated Date - 2020-07-28T23:50:33+05:30 IST