ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్‌ కొనలేదని బాలుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-27T04:58:47+05:30

సెల్‌ ఫోన్‌ కొనలేదని మనస్థాపానికి గురై ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పులపర్తిలో శనివారం చోటుచేసుకుంది.

మృతి చెందిన లక్ష్మణ్‌ దివాకర్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎలమంచిలి రూరల్‌, డిసెంబరు 26 : సెల్‌ ఫోన్‌ కొనలేదని మనస్థాపానికి గురై ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పులపర్తిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి హెచ్‌సీ శ్యామ్‌త్రినాథరావు తెలిపిన వివరాలివి. పులపర్తిలో ఉంటున్న శియ్యాదుల రాము, జోగిరత్నం దంపతులకు ఇంటర్‌ చదువుతున్న గణపతి, పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న లక్ష్మణ్‌దివాకర్‌ (16) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నవాడైన లక్ష్మణ్‌ దివాకర్‌ తన స్నేహితులందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయని, తనకు కూడా కొని ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇందుకు వారు అంగీకరించక పోవడంతో మనస్థాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ చెప్పారు. 


Updated Date - 2020-12-27T04:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising