అవినీతి రహిత పాలనే ధ్యేయం
ABN, First Publish Date - 2020-12-11T04:33:06+05:30
అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఆనందపురం, డిసెంబరు 10ః అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం గంభీరం పంచాయతీలో గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గంభీరం రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యనారాయణ, కోరాడ లక్ష్మణకుమార్, మజ్జి వెంకటరావు, బి.మణిశంకర్నాయుడు, ముసలినాయుడు, అప్పారావు, వెంకటరమణ, రాము, నాయుడు, రామకృష్ణ, సూరిబాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో లవరాజు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T04:33:06+05:30 IST