స్ర్కాప్ అమ్మకంలో వాల్తేరు డివిజన్ రికార్డు
ABN, First Publish Date - 2020-10-12T11:38:15+05:30
రైల్వే కార్యకలాపాలకు సంబంధించి పనిచేయని మెటీరియల్ (స్ర్కాప్) అమ్మకంలో వాల్తేరు డివిజన్ రికార్డు నెలకొల్పింది.
విశాఖపట్నం, అక్టోబరు 11: రైల్వే కార్యకలాపాలకు సంబంధించి పనిచేయని మెటీరియల్ (స్ర్కాప్) అమ్మకంలో వాల్తేరు డివిజన్ రికార్డు నెలకొల్పింది. వివిధ రకాల పనిచేయని మెటీరియల్స్ను వేలం ద్వారా అమ్మకం చేపట్టి రూ.7.43 కోట్లను ఆర్జించింది. స్ర్కాప్ అమ్మకం ద్వారా రూ.7.43 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం తూర్పు కోస్తారైల్వేలో ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారితో కఠిన సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా స్ర్కాప్ అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి మరో అడుగు ముందుకు వేసింది.
వాల్తేరు డివిజన్ డివిజనల్ మేనేజర్ చేతన్కుమార్ శ్రీవాస్తవ మార్గదర్శకాల మేరకు సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కేబీ తిరుపతయ్య ప్రతిభ కనబరిచి స్ర్కాప్ అమ్మకంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ట్రాక్లైన్, వర్కుషాపులకు సంబంధించి స్ర్కాప్ మెటీరియల్ను గుర్తించి ఆన్లైన్లో ఈ-వేలం ద్వారా అమ్మకం చేపట్టినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-10-12T11:38:15+05:30 IST