నేడు ధర్నాను విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2020-12-11T05:18:49+05:30
పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్దేవ్ కోరారు.
సాలూరు: పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్దేవ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనే కారణాలతో ఇబ్బం దులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ.. చేపట్టనున్న ధర్నాలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరు కావాలన్నారు.
Updated Date - 2020-12-11T05:18:49+05:30 IST