బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి అరెస్టు
ABN, First Publish Date - 2020-03-19T10:42:23+05:30
పట్టణంలోని కొత్తవలసకి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దాశరథి
పార్వతీపురం టౌన్, మార్చి 18 : పట్టణంలోని కొత్తవలసకి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి తన కుమార్తె కనిపించడం లేదని పట్టణ పోలీస్స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ కళాధర్ , పోలీస్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. బిత్తరపాడుకి చెందిన గందవరపు శ్రీను అనే ఆటో డ్రైవర్ మాయమాటల్ని నమ్మిన బాలిక తనకు తోడుగా రావాలని స్నేహితురాలిని కోరింది. దీంతో వారు ఆ యువకుడి వెంట వెళ్లారు. అయితే బుధవారం పార్వతీపురంలో ఆర్టీసీ బస్సు ఎక్కిస్తున్న సమయంలో శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Updated Date - 2020-03-19T10:42:23+05:30 IST