ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2020-10-13T09:26:07+05:30

ప్రజల కు అందుబాటులో ఉండి చక్కని సేవ లు అందజేయాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. రామవరం గ్రామ సచి వాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ 



గంట్యాడ, అక్టోబరు 10: ప్రజల కు అందుబాటులో ఉండి చక్కని సేవ లు అందజేయాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. రామవరం గ్రామ సచి వాలయాన్ని ఆయన సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసంద ర్భంగా ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలించారు. జూనియర్‌ లైన్‌మన్‌ హాజరు పట్టిలో సంతకం చేయకపోవడంపై ప్రశ్నించారు. క్షేత్ర పర్యనటకు వెళ్లడం వల్ల సంతకం చేయలేదని జేఎల్‌ఎం అఖిల్‌ వివరణ ఇచ్చారు. ప్రజలకు అందు బాటులో ఉండటం లేదంటూ ఫిర్యాదు వస్తున్నాయని, విద్యుత్‌ ఏఈ కృష్ణ మూర్తికి ఫోన్‌ చేసి తెలిపారు.


ఈసందర్భంగా ఏఈ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం గ్రామంలో రైస్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న బి.ఎర్రమ్మ అనే మహిళకు రైస్‌ కార్డు మంజూరు చేశారు. సచివాలయం ఆవరణను పరిశీలించి, మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ కనకల స్వర్ణకుమార్‌, ఎంపీడీవో నిర్మాలాదేవి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-13T09:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising