ఏలూరు వింత రోగంపై మధ్యాహ్నానికి స్పష్టత: మంత్రి ఆళ్లనాని
ABN, First Publish Date - 2020-12-11T19:38:51+05:30
ఏలూరులో వింత రోగంపై ఈ మధ్యాహ్నానికి స్పష్టత వస్తుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
ఏలూరు: ఏలూరులో వింత రోగంపై ఈ మధ్యాహ్నానికి స్పష్టత వస్తుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని... ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కారణాలు వెల్లడిస్తామన్నారు. కారణాల ఆధారంగా రోగ నిర్ధారణ, చికిత్స, తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.
Updated Date - 2020-12-11T19:38:51+05:30 IST