ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకం శుభపరిణామం: ఎంపీ రఘురామరాజు
ABN, First Publish Date - 2020-08-01T09:39:01+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్
న్యూఢిల్లీ, అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం శుభపరిణామమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ నియామకంపై ఆయన శుక్రవారం స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంచెం జాప్యం చేసినప్పటికీ, ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకుని నిమ్మగడ్డను నియమించారంటూ హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-08-01T09:39:01+05:30 IST