వేదాంతకు వాటాదారుల ఝలక్
ABN, First Publish Date - 2020-10-12T06:08:54+05:30
వేదాంత ప్రమోటర్లకు వాటాదారులు పెద్ద షాకిచ్చారు. సాధారణ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను చౌకగా కొని స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ షేర్లను డీలిస్ట్ చేయాలన్న ప్రమోటర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి...
న్యూఢిల్లీ: వేదాంత ప్రమోటర్లకు వాటాదారులు పెద్ద షాకిచ్చారు. సాధారణ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను చౌకగా కొని స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ షేర్లను డీలిస్ట్ చేయాలన్న ప్రమోటర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రమోటర్లు ఆఫర్ చేసిన రూ.87.5 ధరకు 137.74 కోట్ల షేర్లు అమ్మేందుకు వాటాదారులు ముందుకొచ్చారు. అయితే ఎల్ఐసీ ఒక్కో షేరుకు రూ.320 ధర అడగడంతో వీరిలో చాలా మంది తమ ఆఫర్ను పెండింగ్లో పెట్టారు. దీంతో మొత్తం ఈక్విటీలో 90 శాతం షేర్లు చేజిక్కించుకుని షేర్లను డీలిస్ట్ చేయాలన్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వేదాంత ప్రమోటర్లు కొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. సాంకేతిక కారణాలతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ షేర్లను ధ్రువీకరించలేక పోయినందున ఇష్యూ గడువును మరో రోజు పొడిగించాలని సెబీని కోరారు.
Updated Date - 2020-10-12T06:08:54+05:30 IST