ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణ
ABN, First Publish Date - 2020-07-15T20:02:17+05:30
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5300 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లకు 15 రోజుల ఆన్లైన్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. నిర్మాణ్ సంస్థ, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, అడోబ్ సిస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కా
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5300 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లకు 15 రోజుల ఆన్లైన్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. నిర్మాణ్ సంస్థ, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, అడోబ్ సిస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కా ర్యక్రమాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల ఆన్లైన్ శిక్షణతో పాటు 12 రోజుల అసైన్మెంట్ వర్క్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు శిక్షణ అందించాలని యాజమాన్యాలను ఆయన కోరారు.
Updated Date - 2020-07-15T20:02:17+05:30 IST