12 గంటలకు పెరగనున్న పనివేళలు.. సోమవారం జీవో జారీ!
ABN, First Publish Date - 2020-05-11T01:52:53+05:30
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు
పాట్నా: బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో రోజువారీ పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపు (సోమవారం) ఈ మేరకు జీవో జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఫ్యాక్టరీ చట్టంలోని నిబంధనల్లో మరికొన్నింటిని సడలించాలని నిర్ణయించింది. ఫలితంగా ఉత్పాదకతను పెంచడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించాలని యోచిస్తోంది. బీహార్ కార్మిక వనరుల మంత్రి విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. మార్పులు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.
రిటైల్ షాపుల్లో పనిచేసే వారికీ కొత్త పనివేళలే వర్తిస్తాయా? అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. పరిస్థితిని బట్టి వచ్చే వారాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే పని గంటల నుంచి 9 నుంచి 12 గంటలకు పెంచింది. మధ్యప్రదేశ్ కూడా ఇటువంటి ఆలోచనలోనే ఉంది.
Updated Date - 2020-05-11T01:52:53+05:30 IST