కేరళ సర్కారుపై అమర్త్య సేన్ ప్రశంసల జల్లు
ABN, First Publish Date - 2020-06-27T04:32:25+05:30
తిరువనంతపురం: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ప్రశంసించారు.
తిరువనంతపురం: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ప్రశంసించారు. అమెరికాకు చెందిన ప్రముఖ తత్వవేత్త నోం చోమ్స్కీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ కూడా కేరళ ప్రభుత్వం చర్యలను మెచ్చుకున్నారు.
భారత్లో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో బయటపడింది. నాటి నుంచీ విజయన్ సర్కారు అప్రమత్తంగా ఉంటూ వస్తోంది. కేరళలో ఇప్పటివరకూ మొత్తం 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,941 మంది కోలుకున్నారు. 22 మంది చనిపోయారు.
దేశంలో తొలి కరోనా కేసు కేరళ త్రిస్సూర్ జిల్లాలో నమోదైంది. వూహాన్ నుంచి వచ్చిన వూహాన్ యూనివర్సిటీ విద్యార్ధికి కరోనా సోకినట్లు కేరళ ప్రభుత్వం జనవరి 30న ప్రకటించింది. వుహాన్ నుంచే కరోనా వైరస్ ప్రపంచానికి పాకింది.
Updated Date - 2020-06-27T04:32:25+05:30 IST