ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు లోక్‌సభ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్

ABN, First Publish Date - 2020-09-13T22:11:17+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సకల జాగ్రత్తలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సకల జాగ్రత్తలతో ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయితేనే ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇస్తున్నారు. 


ఇదిలావుండగా, ఐదుగురు లోక్‌సభ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. మంత్రులకు కోవిడ్-19 పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 


పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఉభయ సభల సభ్యులను కోరారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి/ల్యాబొరేటరీలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 


పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా దీనిని రద్దు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించవలసిన అంశాలను, లక్ష్యాలను నిర్ణయించడానికి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంటు సమావేశాల నిర్వహణలో చాలా మార్పులు చేశారు. రోజుకు 4 గంటలపాటు సమావేశాలు జరుగుతాయి. జీరో అవర్‌ సమయాన్ని అర గంటకు కుదించారు. ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. సభ్యులు కూర్చునేటపుడు భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2020-09-13T22:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising